Tuesday, May 7, 2024

తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పరమేశ్వర్ రెడ్డి

తిరుపతి జిల్లా ఎస్పీగా పి పరమేశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. జిల్లాగా ఏర్పడిన తిరుపతికొ మొదటి ఎస్పీగా రావడం గర్వంగా ఉందని ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ప్రజల యోగక్షేమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ముందుకు పోయేందుకు అందరి సహకారాలు అందించాలని కోరారు. పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి చేపడతామని తెలిపారు. రౌడీషీటర్లు మరోసారి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. గంజాయి వినియోగిస్తున్న యువతపై ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతిలో గంజాయి లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. పుణ్యక్షేత్రాలకు వస్తున్న యాత్రికులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడతామని తిరుపతి జిల్లా ఎస్పీ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement