Wednesday, May 15, 2024

Accident :నూజివీడు ఇంద్ర బస్సు కు ప్రమాదం.. ప్రయాణికులు క్షేమం

నూజివీడు, నవంబర్ 21(ప్రభన్యూస్)
నూజివీడు నుంచి హైదరాబాద్ బీహెచ్ఈఎల్‌కి వెళుతున్న ఇంద్ర బస్సు నార్కెట్ పల్లి వద్ద ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున 3.35 కు నూజివీడు ఇంద్ర బస్సు ఎదురుగా వెళుతున్న మరో ఆర్టీసీ బస్సు ను వెనుక నుంచి డీ కొట్టింది.. ఎదురు బస్ సడన్ బ్రేక్ వేయటంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో ఇంద్ర బస్ ముందు భాగం బాగా దెబ్బతింది. ప్రయాణికులందరూ సురక్షితం.. ఎవరికీ ఎటువంటి గాయాలు అవలేదు. అయితే తెల్లవారుజామున కావటంతో ప్రయాణికులందరు గాఢనిద్రలో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో అందరూ ఉలిక్కి పడి లేవటం అహకారాలు పెట్టడం జరిగింది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్టభించిపోయింది. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement