Monday, April 29, 2024

Education | డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి 18న నోటిఫికేషన్‌

అమరావతి, ఆంధ్రప్రభ: గవర్నమెంట్‌, ఎయిడెడ్‌, ప్రయివేట్‌ డిగ్రీ కాలేజీల్లో అన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు కల్పించేందుకు ఈనెల 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి తెలిపింది. ఈనెల 19వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌లో విద్యార్ధులు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈనెల 21 నుండి 23వ తేదీ వరకు స్పెషల్‌ కేటగిరీ వెరిఫికేషన్‌ ఉంటుంది. ఈనెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు వెబ్‌ అప్షన్లు ఉంటాయి. వచ్చే నెల మూడో తేదీన సీట్ల కేటాయింపు చేస్తారు. నాలుగో తేదీ నుండి విద్యార్ధులకు కాలేజీల్లో క్లాసులు ప్రారంభమౌతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement