Saturday, April 27, 2024

రావి ఆకులపై.. స్వర్గీయ ఎన్టీఆర్ సూక్ష్మ చిత్రాలు

ముత్తుకూరు (ప్రభన్యూస్) : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, రాజకీయ చాణక్యుడు, తెలుగుదేశం వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా రావి ఆకులపై ఆయన సూక్ష్మ చిత్రాలను.. సూక్ష్మ చిత్రకారుడు సోమాపద్మారత్నం చిత్రీకరించారు. చలనచిత్ర పరిశ్రమను గుర్తు చేస్తూ ఎన్టీఆర్ ను వివిధ రూపాల్లో చూపిస్తూ చిత్రాలు వేశారు .400 చిత్రాలకు పైగా నటించిన ఎన్టీఆర్ సంచలన ముఖ్యమంత్రిగా పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించి తెలుగు జాతి అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు అంటూ సూక్ష్మ చిత్రాల ద్వారా తన కళా నైపుణ్యంతో రావి ఆకులపై తెలియజేశారు. ఈనెల 28న శతజయంతి ఉత్సవాలు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement