Saturday, April 20, 2024

Organs Mafia – హాస్ప‌ట‌ల్ కు వెళితే కిడ్నీ, గ‌ర్భ‌శ‌యం మాయం..

బీహార్ – క‌డుపు నొప్పితో వెళ్ళిన మహిళ గర్భం, కిడ్నీలు మాయం చేసిన ఘటన సంచలనంగా మారింది. ఇది బీహార్ లో చోటుచేసుకుంది. వివ‌రాల‌లోకి వెళితే ముజఫర్‌పూర్‌లోని మధురాపూర్‌కు చెందిన సునీతాదేవి కడుపునొప్పి కారణంగా స్థానిక శుభకాంత్ క్లినిక్‌కి వెళ్లింది. కానీ తాను డాక్టర్ అని చెప్పుకోని పవన్ కుమార్ అనే కాంపౌండర్ క్లినిక్ నడుపుతున్నాడు. పవన్ కుమార్ తన భార్య జితేంద్ర కుమార్ పాశ్వాన్, ఆర్కే సింగ్‌తో కలిసి ఆ మహిళకు రెండున్నర గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్ కోసం 20 వేలు వసూలు చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సునీతాదేవి శరీరం నుంచి గర్భాశయం, 2 కిడ్నీలు తీసుకున్నారు. అవయవాలను దొంగిలించిన అనంతరం బాధితురాలి ఆరోగ్యం క్షీణించింది. ఆమెను పాట్నాలోని మరో ఆసుపత్రికి తరలించారు. పాట్నా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించి స్కానింగ్ చేశారు. ఈ స్కానింగ్‌ని చూసి ఆస్పత్రి వైద్యులు షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే సునీతాదేవి రెండు కిడ్నీలు, గర్భాశయం వారికి కనిపించలేదు. షాక్ నుంచి తేరుకున్న వైద్యులు ఆమె రెండు కిడ్నీలు, గర్భాశయం చోరీకి గురైనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కాగా, సునీతా దేవి సెప్టెంబర్ 2022 నుండి హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఆమె ప్రభుత్వ సహాయంతో డయాలసిస్ చేయించుకుంటుంది. ఈ క్ర‌మంలోనే శుభ‌కాంత్ క్లినిక్ వైద్యులు, సిబ్బంది క‌ల‌సి ఆమె కిడ్నీలు, గ‌ర్భాశ‌యం మాయం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి కిడ్నీలు అపహరించిన దొంగలను అరెస్టు చేశారు. కానీ నిందితులు ఆ కిడ్నీలను విక్రయించలేదని తెలిపారు. వాటిని సరిగా దాచి ఉంచకపోవడంతో కుళ్లిపోయినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న బాధితురాలు సునీతాదేవి నిందితుడు పవన్‌ కుమార్‌ కిడ్నీని తనకు ఇప్పించి అతడి ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement