Saturday, April 27, 2024

ఏపీ జెన్‌కో పంప్ హౌస్ వద్ద మత్స్యకారులు ఆందోళన..

ముత్తుకూరు : ముత్తుకూరు మండలం నేలటూరు సముద్ర తీరం వెంబడి ఉన్న ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రం పంప్ హౌస్ వద్ద స్థానిక మత్స్యకారులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. స్థానిక సర్పంచ్ భక్తాని కనకయ్యను వెంటపెట్టుకొని సమస్యల పరిష్కారానికి ఆందోళనకు దిగారు. పెండింగ్ లో ఉన్న నెలవారీ జీవన భృతి చెల్లించకుండా ప్రాజెక్టు యాజమాన్యం కాలయాపన చేస్తున్న నేపథ్యంలో వెంటనే జీవన భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీ జెన్ కో భద్రత దళాలు, పోలీస్ శాఖ అధికారులు బందోబస్తు చేపట్టారు. వచ్చే నెల 5వ తేదీ లోపు సమస్య పరిష్కరించి జీవన భృతి చెల్లిస్తామని ప్రాజెక్ట్ అధికారులు హామీ ఇవ్వడంతో మత్స్యకారులు ఆందోళన విరమణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement