Saturday, April 27, 2024

విద్యుత్ షాక్ తో రైతు మృతి..

ముత్తుకూరు, (ప్రభ న్యూస్) : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, వల్లూరు కి చెందిన బొనిగి కృష్ణయ్య (45) అనే రైతు విద్యుత్ షాకుతో (మంగళవారం) మృతి చెందారు. పొలంలోకి మోటర్ వేసేందుకు వెళ్ళగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు.

పొలం వద్దకు వెళ్ళిన కృష్ణయ్య ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి చూడగా మృతదేహంగా కనిపించారు. మృతి చెందిన విషయాన్ని కుటుంబ సభ్యులు లిఖితపూర్వకంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement