Thursday, May 23, 2024

వందో రోజుకి చేరిన నారా లోకేష్ యువ‌గ‌ళం – అడుగులు వేసిన నారా,నంద‌మూరి కుటుంబం..

శ్రీశైలం: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళంస‌ ) పాదయాత్ర నేటితో 100 రోజులు పూర్తిచేసుకుంది. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్‌ సైట్‌ నుంచి 100వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. లోకేశ్‌తో కలిసి ఆయన తల్లి నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు ముందుకు నడిచారు. మార్గంమధ్యలో తల్లి షూ లేస్‌ను లోకేశ్‌ కట్టారు. పాదయాత్ర వంద రోజులు పూర్తయిన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్‌ ఆవిష్కరించారు. బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో ‘యువగళం’ పాదయాత్ర జాతరను తలపిస్తోంది.
కుటుంబసభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర, నందమూరి జయశ్రీ, నందమూరి మణి, సీహెచ్‌ శ్రీమాన్‌, సీహెచ్‌ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని దీక్షిత, కంఠమనేని బాబీ, ఎనిగళ్ల రాహుల్‌ తదితరులు లోకేశ్‌తో కలిసి ముందుకు సాగారు. పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో బోయరేవుల క్యాంప్‌సైట్, మోతుకూరు పరిసరాల్లో 3.కి.మీ మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. మరోవైపు తెలంగాణ తెదేపా తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలా రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు జయరామ్‌ తదితరులు లోకేశ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

100 రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు చెంచు సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేష్ పాల్గొన్నారు.. వారి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విని,అధికారంలోకి రాగానే ప‌రిష్క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

హోరెత్తుతున్న యువగళం 100వ రోజు పాదయాత్ర్ర
• టిడిపి కార్యకర్తల ఆనందోత్సాహాల నడుమ ప్రారంభమైన యువగళం 100వ రోజు పాదయాత్ర.
• యువనేత లోకేష్ తో కలిసి అడుగులు వేసిన‌ తల్లి భువనేశ్వరి, నందమూరి కుటుంబసభ్యులు.
• భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులతో ఉత్సాహంగా సాగుతున్న యువగళం పాదయాత్ర.
• జైలోకేష్, జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తుతున్న యువగళం పాదయాత్ర మార్గం.
• పెద్దఎత్తున తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు, 3 కి.మీ. మేర స్థంభించిన ట్రాఫిక్.
• బాణాసంచా మోతలు, డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరుతో జాతరను తలపిస్తున్న యువగళం.
• 100రోజుల పాదయాత్రకు గుర్తుగా మరికాసేపట్లో పైలాన్ ను ఆవిష్కరించిన‌ భువనేశ్వరి.

Advertisement

తాజా వార్తలు

Advertisement