Friday, April 26, 2024

Lokesh: ద‌ళిత‌ బాలిక‌పై అత్యాచారం..ఏదా గ‌న్‌? ఎక్కడా జ‌గ‌న్‌?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అత్యాచార ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ తీవ్రంగా స్పందించారు. సీఎం జగన్ సొంత జిల్లాలోని ప్రొద్దుటూరులో దళిత బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై స్పందించారు. ‘‘గ‌న్ కంటే ముందొస్తాడ‌ని కోట్ల రూపాయ‌ల ప్ర‌క‌ట‌న‌ల ద్వారా  ప్ర‌చారం చేయించుకున్న జ‌గ‌న్ సొంత క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో అన్నెంపున్నెం ఎరుగ‌ని ద‌ళిత‌ బాలిక‌పై సామూహిక అత్యాచారం జ‌రిగితే..ఏదా గ‌న్‌? ఎక్కడా జ‌గ‌న్‌?’’ అంటూ లోకేష్ ప్రశ్నించారు.  అమాయ‌క బాలిక‌పై లైంగిక దాడిని మ‌హిళా పోలీసులు వెలుగులోకి తెస్తే పోలీసులు నిందితుల్ని ప‌ట్టుకోకుండా కేసు మాఫీ చేయాల‌ని ఎందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని ప్రశ్నించారు. ప‌దిహేనేళ్లు కూడా నిండ‌ని బాలిక‌ని గ‌ర్భ‌వ‌తిని చేసిన నిందితుల‌ని కాపాడ‌ట‌మేనా ఆడ‌బిడ్డ‌ల‌కి క‌ల్పించే ర‌క్ష‌ణ ? అని లోకేష్ మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement