Saturday, April 27, 2024

పెట్రోల్ ధరల పెంపులో ఏపీ నెంబర్ వన్

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి విమర్శలు గుప్పించారు. విధ్వంసం, విద్వేషం రెండు కళ్లుగా సాగుతున్న జగన్ రెండేళ్ల పాలనలో ధరలు రెండింతలు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వ ట్యాక్స్ లకు అదనంగా జగన్ ట్యాక్స్ తోడవడంతో అన్ని రేట్లు పెరిగాయని మండిపడ్డారు. బాదుడు రెడ్డి ధాటికి పెట్రోల్ ధర శుక్రవారం సెంచరీ దాటి రూ.101.61కి చేరి నాటవుట్ గా రికార్డులు సృష్టించిందన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో అట్టడుగు స్థానంలో ఉందని, కొవిడ్ కేసుల్లో 5వ స్థానానికి చేర్చారని విమర్శించారు. ఇది జగన్ రెడ్డి పాపం, ఏపీ ప్రజలకు శాపం అని లోకేశ్ పేర్కొన్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో పెట్రోల్ ధరల పెంపులో మన రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా నిలిపారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
విజయవాడలో పెట్రోల్ ధరలను చెన్నై, బెంగళూరు, హైదరాబాదు, తిరువనంతపురం నగరాల్లో పెట్రోల్ ధరలతో పోల్చుతూ ఓ పట్టికను ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర

Advertisement

తాజా వార్తలు

Advertisement