Thursday, May 16, 2024

రేపు తిరుపతిలో చంద్రబాబు సతీమణి పర్యటన..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. ఇటీవల సంభవించిన వరదలతో తిరుపతి నగరంలో అస్తవ్యస్థం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరదల్లో చనిపోయిన మృతుల కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరపున రూ. లక్ష ఆర్థిక సాయాన్ని మృతుల కుటుంబాలకు అందించనున్నారు. 48 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించనున్నారు.

కాగా, ఏపీ అసెంబ్లీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల అనంతరం నారా భువనేశ్వరి ఏపీలో పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement