Thursday, May 9, 2024

చెట్టుని ఢీ కొన్న కారు : ఇద్ద‌రు మృతి : మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాలు

తూర్పుగోదావరి జిల్లా కారు చెట్టుని ఢీకొన‌డంతో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘ‌ట‌న తూర్పుగోదావరి జిల్లా మారేడిమిల్లి మండలం దేవరపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన సాయి,గణేష్ అనే ఇద్దరు అన్నదమ్ములు. రాజమండ్రికి చెందిన వెంకట గణేష్. ఐ. పోలవరానికి చెందిన గ్రామానికి చెందిన సత్తిబాబు అని తెలిసింది. రాజమహేంద్ర నుండి చింతూరు వెళుతుండగా మార్గమధ్యంలో దేవరపల్లి సమీపంలో జరిగింది. గణేష్ రాజమండ్రి బొల్లినేని హాస్పిటల్ లో ఆర్థోపెడిక్ వద్ద సహాయకునిగా పని చేస్తున్నారని సమాచారం. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement