Friday, May 3, 2024

ప‌రుగుల రాణి పీటీ ఉష‌పై పోలీస్ కేసు

మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేర‌కు ప‌రుగుల రాణి పీటీ ఉష‌పై కేసు న‌మోదు అయింది. పీటీ ఉష‌తో పాటు మ‌రో ఆరుగురిపై సెక్ష‌న్ ఐపీసీ 420కింద కేసు న‌మోద‌యింది. జెమ్మా జోసెఫ్ కోజికోడ్‌లో 1,012 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్‌ను ఓ బిల్డ‌ర్ నుంచి కొనుగోలు చేసింది. ఆ ఫ్లాట్ కోసం జోసెఫ్ వాయిదాల రూపంలో మొత్తం రూ. 46 ల‌క్ష‌లు చెల్లించింది. అయిన‌ప్ప‌టికీ ఫ్లాట్‌ను బిల్డ‌ర్ జోసెఫ్‌కు అప్ప‌గించ‌లేదు. పీటీ ఉష హామీ మేర‌కే బిల్డ‌ర్‌కు డ‌బ్బులు చెల్లించాన‌ని, కానీ ఫ్లాట్ ఇవ్వ‌డంలో జాప్యం జ‌రుగుతోంద‌ని జోసెఫ్ తెలిపారు. బిల్డ‌ర్‌తో పాటు ఉష త‌న‌ను మోసం చేశార‌ని జోసెఫ్ కేసు పెట్టారు.దాంతో ఉష‌పై కేర‌ళ‌లోని కోజికోడ్ పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement