Thursday, May 2, 2024

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి ఉచిత వైద్యం : సీఎం స్టాలిన్

రోడ్డు ప్ర‌మాదంలో గాయాలు అయ్యే వారికి 48గంట‌ల పాటు ఉచిత వైద్యం అందిస్తామ‌ని త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ వెల్ల‌డించారు. ఈ మేర‌కు అధికారుల‌ను ఆదేశించారు. దీని కోసం ప‌లు ప్రైవేట్, ప్ర‌భుత్వ ఆసుపత్రుల‌ను ఎంపిక చేశారు.రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌వారి కోసం ఇన్నుయిర్ కాప్పోమ్ న‌మైకాక్కుమై – 48 అనే కొత్త ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. ఈ ప‌థకం ద్వారా రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ వారి ప్రాణాల‌ను కాపాడే విధంగా ఉంటుంద‌ని చెప్పారు. ఈ వైద్యం నిమిత్తం 48 గంట‌ల వ‌ర‌కు అయ్యే ఖ‌ర్చును రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్నారు. ఈ ప‌థ‌కం కోసం 201 ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు, 408 ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌ను మొత్తం 609 ఆస్ప‌త్రుల‌ను ఎంపిక చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి చెందిన వారు అయినా.. ఈ 609 ఆస్ప‌త్రిల‌లో 48 గంట‌ల పాటు ఉచిత వైద్యం అందిస్తార‌ని స్టాలిన్ వెల్ల‌డించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement