Thursday, May 16, 2024

AP: సీఎం జగన్‌కు న‌ల్లారి కిశోర్ స్ట్రాంగ్ కౌంటర్

చంద్రబాబుపై కుప్పంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఐదేళ్ల క్రితమే కుప్పానికి చంద్రబాబు నీళ్లిచ్చారని తెలిపారు. కుప్పం ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

ఓటర్లకు చీరలు, ప్యాంట్లు పంచేందుకు వైసీపీ నేతలు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తే జగన్ విధ్వంసాలకు పాల్పడ్డారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావాలని నల్లారి కిశోర్ రెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement