Saturday, April 27, 2024

AP: ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ వద్దిరాజు

అక్టోబర్, 24: దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై రాజరాజేశ్వరి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని ఎంపీతో పాటు సతీమణి విజయలక్ష్మీ, కూమార్తె డాక్టర్ గంగా భవానీలు దర్శించుకున్నారు.

ఎంపీ, కుటుంబ సభ్యులను దేవస్థాన ఉద్యోగులు, పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అంతరాలయంలో వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఎంపీ రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతలపూడి సమీపంలో గల ప్రగడవరంలోని శివాలయంలో గల అమ్మవారిని దర్శించుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement