Sunday, April 28, 2024

RR: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కేశంపేట: దసరా పండుగకు అమ్మమ్మ స్వగ్రామానికి వచ్చి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన సోమవారం రాత్రి మండల పరిధిలోని కొత్తపేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మహేశ్వరం మండలం కోళ్ల పడకల్ గ్రామానికి చెందిన పాలాది భరత్ కుమార్ (22) రోడ్డుపైన నిలుచున్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని మృతిచెందాడు.

కొద్దిసేపటి క్రితమే అమ్మమ్మ గారి గ్రామమైన కేశంపేటలో బంధువులతో సరదాగా గడిపి ఇంటికి వెళ్తున్న తరుణంలో ఈ సంఘటన జరగడంపై కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. రైతులు మొక్కజొన్నలు రోడ్లపైన ఆరబోయడంతో పాటు వాహనాలను అక్కడే వదిలేయడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని బంధువుల ఆరోపించారు. మృతుడు బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement