Saturday, April 27, 2024

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ

ప్రధాని మోదీకి నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖ రాశారు. నర్సాపురంలో అంతర్జాతీయ ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. కృష్ణా – గోదావరి బేసిన్ నుండి లక్షల కోట్ల ఆదాయం ఆక్వా రంగం దేశానికి తెస్తుందని తెలిపారు. ఆక్వా యూనివర్సిటీ వస్తే మత్స్యకారులకు మెరుగైన సౌకర్యాలు, మెలకువలు అందుబాటులో వస్తాయని చెప్పారు. తద్వారా ఇంకా భారీగా దేశ ఆర్థికాభివృద్ధిలో ఆక్వా రంగం దోహదపడుతుందని వివరించారు. అంతర్జాతీయ యూనివర్సిటీకి కావలసిన దాదాపు వెయ్యి ఎకరాలు నర్సాపురం మండలం గొల్లపాలెంలో సిద్ధంగా ఉందని ఎంపీ రఘురామ తెలిపారు. ఆక్వా రంగం అభివృద్ధి కోసం యూనివర్సిటీ మంజూరు చేయాలని ప్రధానిని రఘురామకృష్ణం రాజు లేఖలో కోరారు.

ఏపీ గవర్నర్ కు కూడా ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖ రాశారు. మాజీ జడ్జి రామకృష్ణ ను జైల్ నుండి ఆసుపత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు. రామకృష్ణ డయాబెటిక్ పేషేంట్ కావడంతో షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయని తెలిపారు. రామకృష్ణ అభ్యర్ధనను స్వీకరించి పీలేరు సబ్ జైల్ నుండి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయాలని గవర్నర్ ను రఘురామ కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement