Sunday, May 5, 2024

రైతుల పక్షపాతి సీఎం జగన్: ప్రభుత్వ విప్ సామినేని

రైతుల పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని రాష్ట్ర ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట శాసనసభ్యులు సామినేని ఉదయభాను గారు అన్నారు. గురువారం పెనుగంచిప్రోలు గ్రామంలోని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం – 2 వద్ద మండలంలోని అనిగండ్లపాడు గ్రామానికి చెందిన సామినేని ప్రసాద్ రైతు మిత్ర గ్రూప్ సభ్యులకు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా సబ్సిడీపై మంజూరైన వరికోత యంత్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం గ్రామంలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement