Wednesday, May 8, 2024

గ‌ల్లంతైన సుబ్బ‌రాజు కుటుంబానికి ఎమ్మెల్యే భూమ‌న ప‌రామ‌ర్శ

తిరుపతిలో వరద ఉధృతి కారణంగా సుబ్బరాజు గల్లంతయ్యాడు. దీంతో వారి కుటుంబాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పరామర్శించారు. ఈసంద‌ర్భంగా తన భర్తను రక్షించాలని సుబ్బరాజు భార్య గాయత్రి వేడుకున్నారు. గాయత్రి సొమ్మసిల్లి పోవడంతో ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేపట్టాలని భూమ‌న‌ ఆదేశించారు. అలాగే సుబ్బరాజు విషయంలో జిల్లా కలెక్టర్ కి తగు సూచనలు ఇఛ్చిన ఎమ్మెల్యే…. గల్లంతైన లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఎమ్మెల్యే గాలింపు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement