Monday, April 29, 2024

మంత్రి శంకరనారాయణకు మాతృ వియోగం

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణకు మాతృ వియోగం కలిగింది. శనివారం అర్ధరాత్రి ధర్మవరం పట్టణంలో మంత్రి శంకర్ నారాయణ మాతృమూర్తి గుండెపోటుతో మరణించారు. యశోదమ్మ వయసు 80 సంవత్సరాలు. శంకర్ నారాయణ తండ్రి పట్టణంలో న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. తల్లి మరణవార్త వినగానే విశాఖలో ఉన్న మంత్రి హుటాహుటిన బయల్దేరి స్వగ్రామం చేరుకున్నారు. ధర్మవరం వైసిపి నాయకులు యశోదమ్మ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యశోదమ్మ గతంలో పురపాలక సంఘం కౌన్సిలర్‌గా కూడా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement