Saturday, April 27, 2024

మ‌ట్టి మాఫియాపై మైనింగ్ విజిలెన్స్‌ దాడులు.. రెండు టిప్పర్లు, రెండు జేసీబీలు సీజ్

టంగుటూరు (ప్రభ న్యూస్) : గ్రావెల్ ను అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న మ‌ట్టి మాఫియాపై మైనింగ్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఇవ్వాల (సోమ‌వారం) జ‌రిపిన దాడుల్లో రెండు టిప్పర్ లు, రెండు జేసీబీల‌ను సీజ్ చేసిన‌ట్టు తెలిపారు. ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా కొణిజేడు, కందులూరులో జ‌రిగింది.

టంగుటూరు మండలంలోని కందులూరు, కొణిజేడు ప్రాంతాల్లో అక్రమంగా ఎర్ర మ‌ట్టి తవ్వకాలపై మైన్స్ డీడీ జగన్నాధ రావు ఆధ్వ‌ర్యంలో విజిలెన్స్ అధికారులు ఏక కాలంలో దాడులు చేశారు. ఇప్పటివరకు కొండ ప్రాంతాల్లో ఎంత గ్రావెల్ త‌ర‌లించుకువెళ్లారు లెక్కల‌తో సహా తేల్చి దానికి త‌గ్గ‌ట్టు జరిమానా విధిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement