Monday, April 29, 2024

కొండమోడు- పేరేచర్ల జాతీయ రహదారికి మహర్ధశ.. నాలుగు వరుసల రహదారి విస్తరణకు 1032 కోట్లు

అమరావతి, ఆంధ్రప్రభ : జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌)167 ఏజీ లోని కొండమోడు- పేరేచర్ల రహదారికి మహర్ధశ పట్టనుంది. ఈ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. మొత్తం నాలుగు వరుసల్లో ఈ రహదారిని 51 కి.మీ. మేర విస్తరించేందుకు రూ.1032.52 కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2025 -26 ఆర్దిక సంవత్సరం లోగా ఈ రహదారి విస్తరణను పూర్తి చేసేందుకు ఎన్‌హెచ్‌ఏఐ ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టులో అతి ముఖ్యమైన భూసేకరణ ప్రక్రియకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement