Sunday, May 5, 2024

Gannavaram : తాళం వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ..

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండలం తేలప్రొలులో తాళాలు వేసి ఉన్న ఇంట్లో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వింత వీరారెడ్డి నివాసంగా గుర్తించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరారెడ్డిని ఆపరేషన్ నిమిత్తం కుమారుడు హైదరాబాద్ తీసుకెళ్లాడు. గత 20రోజుల నుంచి ఇంటికి తాళాలు వేసి ఉండటాన్ని దుండగులు గమనించారు.

ఆపరేషన్ చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో సమీప బంధువులచే ఇంటిని శుభ్రం చేసే క్రమంలో ఇంట్లోని వస్తువులు చెల్లాచెదరుగా పడిఉండటం, బీరువా పగలగొట్టి బంగారం, వెండి, నగదు అపరించినట్లు బంధువులు గుర్తించారు. భారీ మొత్తంలో బంగారం, నగదు, వెండి అపహరణకు గురైనట్లు బంధువులు చెబుతున్నారు. ఇంటి యజమానులు లేకపోవడంతో వారు వచ్చిన తర్వాత అసలు ఎంత, ఏమి పోయిందన్నది బయటపడాల్సి ఉంది. బంధువుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement