Sunday, April 28, 2024

ఈట‌ల‌ను చంపేందుకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర – ఈట‌ల జ‌మున

హుజూరాబాద్ – తన భర్త ఈటలను చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈటల హత్యకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తన భర్త హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని కౌశిక్ రెడ్డి చెప్పినట్టు తనకు తెలిసిందని పేర్కొన్నారు..

కాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ అండ చూసుకుని కౌశిక్ రెడ్డి రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. పదవుల కోసం ఈటల తలవంచరని అన్నారు. ఈటల బీజేపీలోనే ఉంటారని… ఆయన పార్టీ మారుతారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తేల్చి చెప్పారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement