Wednesday, May 8, 2024

మావోయిస్టుల ఘాతుకం.. కానిస్టేబుల్ మృతి..

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు దారుణానికి పాల్ప‌డ్డారు. ఓ కానిస్టేబుల్‌పై దారుణానికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. టాటమ్ విలేజ్‌లో టెటం పీఎస్‌ కానిస్టేబుల్‌ ఉమేష్‌ మార్కంను మావోయిస్టులు నిన్న రాత్రి పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు.

బుధవారం ఉదయం జవాన్లు మృతదేహాన్ని వెలికితీశారు. మావోయిస్టులను మట్టుబెట్టేందుకు టాటమ్‌ గ్రామంలో క్యాంప్‌ను ప్రారంభించడంలో ఉమేశ్‌ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. కాగా, ఉమేశ్‌ మృతిని దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ ధృవీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement