Monday, April 29, 2024

ధ‌ర్నాల‌కు క‌లెక్ట‌ర్ల అనుమ‌తి త‌ప్ప‌నిస‌రి..’కేటీఆర్’..

రాష్ట్ర వ్యాప్తంగా టిఆర్ ఎస్ పార్టీ నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. ఇందులో భాగంగా శుక్రవారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. ధర్నాలకు ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతి తీసుకోవాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. తెలంగాణ రైతుల నుంచి వరి ధాన్యాన్ని కొనడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నందు వ‌ల్ల టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. కేంద్ర వైఖ‌రిపై ఆ పార్టీ నేత‌లు, రైతులు మండిప‌డ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement