Saturday, April 27, 2024

AP :విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా నందవరం మండలం నదికైరవడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో విద్యుత్ సమస్యలో భాగంగా విద్యుత్ పోల్ ను మారుస్తుండగా ప్రమాదవాషత్తు విద్యుత్ షాక్ తగిలి నబిరసూల్ (38) అనే కాంట్రాక్ట కూలి మృతి చెందాడు. లైన్ మ్యాన్ విద్యుత్ పని చేసేందుకు నందవరం మండలం ముగతి గ్రామానికి చెందిన నబిరసూల్ ను తన వెంట తీసుకొని వెళ్ళాడు.

అయితే విద్యుత్ వైర్లు మార్చే సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయాలి, కానీ అక్కడ లైన్ మ్యాన్ నిర్లక్ష్యంతో విద్యుత్ తీగల్లో విద్యుత్ సరఫరా కావడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ గురై నబిరసూల్ అక్కడికక్కడే నేలపై కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.ఇలా విద్యుత్ పనులు చేసేటప్పుడు నిర్లక్ష్యం వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కుటుంబికులు డిమాండ్ చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement