Thursday, May 2, 2024

Kuppam: అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి

కుప్పం, జులై 25(ప్రభ న్యూస్) : రామకుప్పం మండలం కర్ణలపట్టు అటవీప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో చిరుతపులి మృతిచెందింది. అటవీ ప్రాంతంలో మృతిచెంది పడిఉన్న చిరుత పులి మృతదేహాన్ని పశువుల కాపరులు చూసి అటవీ అధికారులకు సమాచారం అందించారు.

చిరుత మృతదేహం నుండి దుర్వాసన పెద్దఎత్తున రావడంతో వారం ముందు మృతిచెందినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వన్యప్రాణుల వేటగాళ్ల దాడిలో మృతి చెంది ఉంటుందని అ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారుల దర్యాప్తులో నిజానిజాలు తేలాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement