Thursday, May 16, 2024

నేతలు వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలే శాశ్వతం: చంద్రబాబు

అమరావతి: పార్టీలోకి నేతలు వస్తుంటారు.. పోతూ వుంటారని, కార్యకర్తలే శాశ్వతమని మాజీ ముఖ్య‌మంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తల కోసం పనిచెయ్యాలని సూచించారు. ఇకపై సంప్రదాయ రాజకీయాలు నడవవని, ఢీ అంటే ఢీ అనే అభ్యర్ధుల్ని దించుతామని స్పష్టం చేశారు. సోషల్ మీడియా అండ్ ఐటీడీపీ ద్వారా మీరు చేసే ప్రతి కార్యక్రమాల సమాచారం పూర్తి స్థాయిలో వుందన్నారు. ఇకపై మీరు మారకపోతే వేటు తప్పదని స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement