Saturday, April 27, 2024

ప్రొఫెసర్ ల పట్ల విసి అనురాగం – విద్యార్ధుల‌ వినూత్న నిరసన

కర్నూల్ – రాయలసీమ యూనివర్సిటీ లో ప్రొఫెసర్లను తొలగించకుండా కాపాడుకుంటూ వెనకేసుకు వస్తున్న విసి తీరును నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ,పీడీఎస్ యు సంఘాల ఆధ్వర్యంలో వినూత్నంగా దున్నపోతుకు వినతిపత్రాన్ని సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ,పీడీఎస్ యు సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్సులు శ్రీరాములు గౌడ్, ప్రకాష్, భాస్కర్ లు మాట్లాడుతూ నియమితులైన ముగ్గురు ప్రొఫెసర్లను తీసివేయమని విద్యార్థి సంఘాలు గత కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నా వీసీ వాటినీ పట్టించుకోకుండా ఉన్నార‌ని విమ‌ర్శించారు.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ,పీడీఎస్ యు సంఘాల నాయకులు శరత్ కుమార్, సురేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement