Thursday, May 2, 2024

శ్రీ‌శైలం ప్రాజెక్టుకు కొన‌సాగుతున్న‌ వదర

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల నుంచి 1.47 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, సుంకేశుల నుంచి 1.59 లక్షల క్యూసెక్కుల ప్రవాహం శ్రీశైలానికి వచ్చిచేరుతున్నది. దీంతో జలాశయం నీటిమట్టం 840.1 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. శ్రీశైలం గరిష్ట నీటినిల్వ 215.8 టీఎంసీలు. ఇప్పుడు 61.92 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టులోకి వరద వస్తుండంతో ఎడగట్టు విద్యుత్‌ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. దీంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 31,784 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement