Sunday, April 28, 2024

బొట్ల వనపర్తిలో వృద్ధుని హత్య… ఆస్తి తగాదాలే కారణం

ఆస్తి తగాదాలతో వృద్ధుడిని దారుణంగా హత్య చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి లో చోటుచేసుకుంది. శనివారం జూలపల్లికి చెందిన సిలివేరు లింగమూర్తి ధర్మారం మండలం బొట్ల వనపర్తికి వెళ్లగా పథకం హత్య చేసినట్లు తెలిసింది. అన్నదమ్ముల మధ్య ఉన్న ఆస్తి తగాదాలే హత్యకు కారణమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెళ్ళడైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సంఘటన స్థలాన్ని పెద్దపెల్లి సిఐ ప్రదీప్ కుమార్, ధర్మారం ఎస్ఐ శ్రీనివాసులు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సిఐ ప్రదీప్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement