Friday, May 3, 2024

డోన్ లో ప్ర‌భుత్వ‌ అతిథి గృహాన్ని ప్రారంభించిన మంత్రి బుగ్గ‌న‌

నంద్యాల జిల్లా డోన్ లో ప్రభుత్వ అతిథి గృహాన్ని ఆదివారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. ఆర్ అండ్ బీ కాంపౌండ్ లో రూ.3 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన నాలుగు సూట్ల ఇన్ స్పెక్ట‌ర్ బంగ్లాను ఇక్కడ నిర్మించారు. హాజరైన మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు, కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్, డోన్ ఎంపీపీ రేగటి రాజశేఖర్ రెడ్డి, రవాణా రహదారులు భవనాల శాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన, నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement