Monday, May 6, 2024

బాసరలో రోడ్డు ప్రమాదం.. ప‌లువురికి గాయాలు..

నిజామాబాద్ భైంసా ప్రధాన రహదారిపై రైల్వే స్టేషన్ మూల మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురికి స్వల్ప గాయాల‌య్యాయి. స‌కాలంలో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడం తో ప్రాణాపాయo తప్పింది. మహారాష్ట్ర లోని దెగ్ళూరుకు చెందిన ఓ కుటుంబం అమ్మవారి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణం లో ఘటన చోటుచేసుకుంది. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కుటుంబ స‌భ్యులు తీవ్రంగా గాయపడ్డారు. బాసర మీడియా పోలీసులకు సమాచారo అందించింది. అంబులెన్సు రావడం ఆలస్యం అవడంతో ఎఎస్సై ఉజ్వల పోలీస్ వాహనంలోనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement