Wednesday, May 22, 2024

Breaking : క‌ర్నూలులో రూ.5కోట్ల విలువైన బంగారం స్వాధీనం

రూ.5కోట్ల విలువైన బంగారం ప‌ట్టుబ‌డిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌ర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా పంచలింగాల సబ్ చెక్ పోస్టు వద్ద భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి కోయంబత్తూరుకు ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఐదు కోట్ల రూపాయల విలువైన బంగారం బిస్కెట్లను, తొంభై లక్షల రూపాయల నగదును చెక్ పోస్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బంగారం వ్యాపారులే దీనిని కోయంబత్తూరుకు తరలిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement