Wednesday, May 15, 2024

రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి

ఏపీలోని కర్నూలు జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీకొడుకు దుర్మరణం చెందాడు. హైదరాబాద్ లో ఎంబ్రాయిడరీ వర్క్‌ చేస్తు జీవనం సాగిస్తున్న తండ్రి మహ్మద్ (75), కొడుకు హుసేన్ (35) స్వగ్రామానికి కారులో బయలు దేరారు. ఇవాళ కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీ కొట్టారు.

తండ్రి పింఛన్‌ కోసం స్వగ్రామం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాలను కోడుమూరు పీహెచ్​సీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement