Monday, May 13, 2024

భారత్ బంద్ జయప్రదం చేయాల‌ని కోరుతూ ర్యాలీ..

కర్నూలు – ఈ నెల 26న త‌ల‌పెట్టిన భార‌త్ బంద్ జ‌యప్ర‌దం చేయాల‌ని కోరుతూ నగరం సిఐటియు ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వ‌హించారు.. ఈ ర్యాలీ చౌక్, పూల బజార్, వన్ టౌన్, చిన్న మార్కెట్ మీదుగా సాగింది.. ఈ సంద‌ర్బంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గౌడ్ దేశాయ్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మత విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అతి కారుచౌకగా అప్పజెప్పి దేశసంపదను దోచిపెట్టడం జరుగుతుందని విమర్శించారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్యక్రమంలో అబ్దుల్ దేశాయ్, రామకృష్ణ, రాంబాబు, మాసం, మద్దిలేటి మరియు సిఐటియు కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement