Friday, May 24, 2024

వెనకబడిన వర్గాలకు పెద్దపీట.. మధుసూదన్

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి పెద్దపేట వేస్తున్నారని కర్నూలు స్థానిక సంస్థల మండలి అభ్యర్థి డాక్టర్ ఏ.మధుసూదన్ అన్నారు. మంగళవారం ఆయన కర్నూలు ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు డాక్టర్. సంజీవ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుసూదన్ తన విజయానికి కృషి చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు పెద్దపీట వేశారన్నారు. విజయానికి వైస్సార్సీపీపార్టీ తరపున తన వంతు తప్పకుండా కృషి చేస్తానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement