Wednesday, May 15, 2024

క‌ర్నూలు మేయ‌ర్ గా రామ‌య్య‌, డిప్యూటీ మేయ‌ర్ గా రేణుక‌…

క‌ర్నూలు – న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ గా బి వై రామ‌య్య‌, డిప్యూటీ మేయ‌ర్ గా ఎస్ రేణుక‌లు ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.. నేటి ఉద‌యం కౌన్సిల్ హాలులో కొత్త‌గా ఎన్నికైన కార్పొరేట‌ర్లు ప్ర‌మాణ స్వీకారం చేశారు.. అనంత‌రం మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ పోస్ట్ ల‌కు క‌లెక్ట‌ర్, ప్రిసైడింగ్ అధికారి వీర‌పాండ్య‌న్ నిర్వ‌హించారు.. వైసిపి త‌రుపు నుంచి ఆయా పోస్ట్ ల‌కు ఒక్కొక్క‌రే నామినేష‌న్ వేయ‌డంతో రామ‌య్య‌, రేణుక‌లు ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించారు.కాగా కొత్త‌గా ఎన్నికైన వారిని వైసిపికి చెందిన క‌ర్నూలు, పాణ్యం ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులు అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement