Sunday, May 5, 2024

నీటి సరఫరా ప్లాన్‌ను పరిశీలించిన జీఎం

శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కే-8 గని నుండి కాలనీలకు నీటి సరఫరా ప్లాన్‌ను ఏరియా జీఎం ఎం.సురేష్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాంపూర్‌ ఏరియాలో ఉంటున్న ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కల్గకుండా తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గని మూత పడుతుండటంతో లోపల ఏమైనా యంత్రాలు ఉన్నాయా, ఉంటే వాటిని పైకి తీసుకురావడానికి సంబంధించిన విషయాలపై చర్చించారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గని ఏజెంట్‌ రఘుకుమార్‌, డీజీఎం ఐఈ చిరంజీవులు, ఏరియా సర్వే ఆఫీసర్‌ రాఘవేందర్‌రావు, ఇంచార్జి మేనేజర్‌ హరికిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement