Wednesday, May 1, 2024

కోడుమూరులో వ్య‌క్తి దారుణ హ‌త్య‌..

కర్నూలు : కోడుమూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. దేవనకొండ మండలం కున్నూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం నాయకుడు సిద్ధప్పను కోడుమూరులో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన సిద్దప్ప బంధువులు ప్రస్తుతం కున్నురు సర్పంచిగా ఉన్నారు. సిద్దప్ప స్వగ్రామం కున్నూరు అయినప్పటికీ కోడుమూరులో ఉంటున్నారు. ఈ క్రమంలో ఉదయం పనిపై బయటకు వచ్చిన సిద్దప్పను అప్పటికే అక్కడ మాటు వేసిన ప్రత్యర్థులు దారుణంగా హ‌త్య చేశారు. హత్యకు గురైన సిద్ధప్ప గతంలో దేవనకొండ మాజీ సర్పంచ్, ఫ్యాక్షన్ లీడర్ కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడు హత్య కేసులో జైలు శిక్ష అనుభవించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం కోడుమూరులో ఉంటూ గ్రామ రాజకీయాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్న సిద్ధప్ప మారిన రాజకీయాల నేపథ్యంలో తెలుగుదేశంలో కొనసాగుతున్నారు. మాజీ ఎంపీ, తెలుగు దేశం జాతీయ నాయకులు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గంలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement