Monday, April 29, 2024

వైఎస్ వివేకా హత్యకేసు విచారణ.. వేరే రాష్ట్రానికి బదిలీ.. సుప్రీంకోర్టు

తమకు ఏపీలో నిర్వహిస్తున్న విచారణపై నమ్మకం లేదని.. దర్యాప్తు సంస్థ అధికారులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని.. కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నేడు ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలనుకుంటున్నారని పిటిషనర్ లను ధర్మాసనం ప్రశ్నించింది. ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలన్న అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది. దీనిపై శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని ధర్మాసనం తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement