Thursday, April 18, 2024

Bharat Jodo Yatra: ఏపీలో రెండోరోజు కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర..

ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో బుధవారం రెండో రోజు ఆదోని నియోజకవర్గంలో సాగుతోంది. చాగి శిబిరం నుండి ఉదయం 6 గంటలకు ప్రారంభమైన యాత్ర నారాయణపురం, దనాపురం మీదుగా సాగి కల్లుబావి వద్ద టీ విరామం తీసుకున్నారు. తరువాత ప్రారంభమైన యాత్ర ఆదోని పుర వీధుల గుండా సాగింది. వివిధ వర్గాల ప్రజలతో మమేకమై రాహుల్ తన యాత్ర కొనసాగించారు. ఆదోనిలోని మహాయోగి లక్ష్మమ్మ ఆలయము సందర్శించారు. ఆలయ పూజారులు హారతి ఇచ్చారు. రాహుల్ గాంధీకి నుదుటపై తిలకం దిద్దారు. ఆదోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన విరామ శిబిరంలో విరామం తీసుకుంటున్నారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు యాత్ర ప్రారంభమై అరెకల్ వరకూ సాగనుంది. గట్టి భద్రత మధ్య యాత్ర సాగుతోంది. యాత్రలో ఏఐసిసి అగ్రనేతలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement