Wednesday, May 8, 2024

Breaking: నంద్యాల జిల్లాలో వ్య‌క్తి దారుణ హ‌త్య

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా బావిపల్లి వద్ద పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. నంద్యాలకు చెందిన కొచ్చేరువు శీను అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దుండగులు అతని వెంటాడి, వేటాడి కిరాతకంగా హత్య చేశారు. హత్యకు గురైన శీను.. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత అనుచరుడు కావడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement