Wednesday, April 24, 2024

రైల్వే ట్రాక్ లో విరిగిన ప‌ట్టా.. పంజాబ్ మెయిల్ కి త‌ప్పిన ముప్పు

రైల్వే ట్రాక్ లోని ఓ ప‌ట్టా విరిగిపోయిందా..అది గుర్తించిన న‌సీమ్ అనే యువ‌కుడు గ్యాంగ్ మెన్ కి స‌మాచారం అందించాడు.అక్కడికి చేరుకుని పరిశీలించిన ఆయన.. పట్టా విరిగిందని నిర్ధారించుకున్నాడు. అయితే పంజాబ్ మెయిల్ అదే రూట్‌లో దూసుకొస్తుంది. అప్పటికే వారున్న ప్రాంతానికి సమీపించింది. ఇద్దరూ కలిసి రైలుకు ఎర్రజెండా చూపించారు. కానీ రైలు స్పీడ్‌మీద ఉండటంతో ఆగకుండా వెళ్లింది. వారు జెండా ఊపుతూ కేకలు వేయడంతో రైలు వేగం క్రమంగా తగ్గింది. అప్పటికే రైలులోని కొన్ని బోగీలు పట్టా విరిగిన ప్రాంతాన్ని దాటేశాయి. అయితే రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పంజాబ్‌ మెయిల్‌ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్‌ మెయిల్‌.. పశ్చిమబెంగాల్‌లోని హౌరా నుంచి అమృత్‌సర్ వెళ్తోంది. ఈ క్రమంలో బీహార్‌ దాటి ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించింది. అయితే ఘాజీపూర్‌ జిల్లాలోని జమానియా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న గడాహిన్‌ గ్రామం వద్ద ట్రాక్‌లోని ఓ పట్టా విరిగిపోయింది. దాంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement