Saturday, May 4, 2024

ప్రజల కోసం పుట్టిన పార్టీ వైసిపి – ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

కర్నూలు నగరంలోని స్థానిక పాతబస్టాండ్ సమీపంలో ఉన్న వైస్సార్సీపీ ఎమ్మెల్యే కార్యాలయంలో కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పార్టీ నేతలు, కార్యకర్తలు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని స్థాపించారని.. వైఎస్‌ జగన్‌ను సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మకై ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. సీఎంగా బాధ్యతలు చేప్పటి ప్రభుత్వంను ఇంత సమర్ధవంతగా ప్రజలకు మంచి జరగాలని గొప్ప ఆలోచనలు రూపుదీది పార్టీని ప్రజల నుండి పుట్టిన పార్టీగా వారి కష్టనష్టలు పలుపంచుకొనే కార్యకర్తలను ప్రజలను ఒక్క సొంత ఇల్లు లాగా భావించే విధంగా పార్టీనీ స్థాపించారన్నారు.. పార్టీ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తి అయినప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు.. చిన్న పిల్లల చదువు అమ్మ ఒడి పధకంతో మొదలు వృద్ధులు వరకు ప్రతీ ఒక్క వర్గల ప్రజల గురించి ఆలోచన చేసి ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకలు అమలు చేసి అందరి అభివృద్ధికి కృషి చేస్తున్న నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే పార్టీ లోని నేతలను, కార్యకర్తలను బలోపేతానికి కీలకమైన ఉన్నత పదవులు ఇస్తూ కృషి చేశారన్నారు…ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement