Saturday, April 20, 2024

బెల్లంపల్లి పట్టణం, మండలంలో ఘనంగా శివరాత్రి వేడుకలు

బెల్లంపల్లి, మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో, గణష్‌ దేవాలయంలో, అయ్యప్ప దేవాలయంలో, రామాలయంలో, బూద గెస్ట్‌హౌస్‌లోని శివాలయంలో, సాయిబాబా ఆలయంలో, మండలంలోని లింగాపూర్‌ 1000 లింగాల దేవాలయం, చంద్రవెల్లిలోని శ్రీ అన్నపూర్ణ సహిత సోమేశ్వర ఆలయంలో, బూదకుర్దులోని రామాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. శివరాత్రి
సందర్భంగా ఉదయం నుండి ఆలయాల్లో భక్తులు సేద తీరారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ ఆలయాలు ప్రాంగణాలు అన్ని శివనామ స్మరణతో మారుమోగాయి. ఇందులో భాగంగా చంద్రవెల్లి సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా చంద్రవెల్లి సోమేశ్వర దేవాలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జరిగే శివపార్వతుల కళ్యాణానికి బెల్లంపల్లి వాస్తవ్యులు వైద్య నిర్మల-సుభాష్‌, సాయిప్రితీష్‌, మహేష్‌, కుమార్‌, లక్ష్మీ-కామేశ్వర్‌లు కళ్యాణానికి పట్టు వస్త్రాలు, మంగళసూత్రాలు, మట్టెలను సమర్పించారు. అనంతరం బూద గెస్ట్‌హౌస్‌లోని శివాలయంలో బీజేపీ మహిళా అధ్యక్షురాలు దార కళ్యాణి ఆద్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. పలు దేవాలయాల్లో భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement