Sunday, April 28, 2024

Kurnool – వైసీపీ కార్పొరేట‌ర్‌కు ధ‌ర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్

కర్నూలులో పోలీసులు రెచ్చిపోయారు. ఓ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడిని చితకబాదారు. దుస్తులు విప్పి.. లాఠీలతో కొట్టి..కాళ్ళతో తొక్కి హింసించారు. ఎన్నికల సమావేశం ఉందని పిలిపించి ఇద్దరినీ పోలీసులు చావబాదారు. ఎలాంటి కేసులు లేకున్నా థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. కర్నూలు 8వ డివిజన్ కార్పొరేటర్ పరమేష్ (వైసీపీ), 9వ వార్డు కార్పొరేటర్ కుమారుడు నవీన్ (వైసీపీ)ను పోలీసులు చితకబాదారు.

ఎన్నికల సమావేశం ఉందని పిలిపించి ఇద్దరినీ పోలీసులు చితకొట్టారు. జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి.. దుస్తులు విప్పి, లాఠీలతో కొట్టి, కాళ్ళతో తొక్కి హింసించారు. ఎలాంటి కేసులు లేకున్నా.. ఇద్దరిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారు. విష‌యం తెలుకున్న ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్ వారిని ప‌రామ‌ర్శించారు.. ఈ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డ పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ కలెక్టర్, ఎస్పీలకు వైసిపి నేత‌లు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement