కుప్పం, (ప్రభ న్యూస్ ): రాష్ట్ర ముఖ్య మంత్రి వైగస్ జగన్మోహనరెడ్డి ప్రయోగత్మకంగా ప్రతి నియోజకవర్గం వైకాపా శ్రేణులతో నిర్వహించే సమీక్షా సమావేశంను కుప్పం నియోజకవర్గం నుండి గురువారం ప్రారంభించారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో జరిగింది. కుప్పం వైకాపా నాయకులను ఉద్దేశించి ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ… కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి వైకాపా కట్టుబడి ఉందని తన సొంత నియోజకవర్గం పులివెందులతో సమానంగా కుప్పంను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు వైకాపాను ఆదరించి సర్పంచ్, పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికలల్లో భారీ మెజారిటీ ఇచ్చారని వారి నమ్మకంను మరింత పెంచెందుకు త్వరలో కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిదంగా కుప్పం నియోజకవర్గ ప్రజలకు సాగునీరు,దాహర్తి తీర్చే హంద్రీ నివా ప్రాజెక్టు త్వరితాగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
మీరు ప్రజల్లో ఉండి ప్రభుత్వ సంక్షేమ పధకాలను వారికి అందించి రాబోయే ఎన్నికలల్లో కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ ను గెలించడమే ఏకైక లక్ష్యం పెట్టుకొని ఏ ఇతర విషయాలను పట్టించుకోకుండా కుప్పం నియోజకవర్గంను వైకాపా ఖాతాలో వేయాలని ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసి అత్యంత వేగంగా పనులు జరిగేవిధంగా పర్యవేక్షణ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డిని సి ఎం ఆదేశించారు. భరత్ యువకుడు కావడంతో మీరందరు ఆయనకు వంద శాతం సహాయ సహకారాలు అందించి ముందుకు నడిపించాలని కుప్పం వైకాపా ప్రజాప్రతినిధులను, నాయకులను ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.